News March 29, 2024

నెల్లూరుకు సీఎం జగన్ రాక

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 6న కావలి పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బస్సు యాత్ర ఏర్పాట్లు రూట్ మ్యాప్ ను పరిశీలించారు. బస్సు యాత్ర కార్యక్రమంతో వైసీపీకి విశేష ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. మరోసారి వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 25, 2026

నెల్లూరు: పేరుకే నగర పంచాయతీలు..!

image

బుచ్చి, అల్లూరుకు జనాభాను చూసి నగర పంచాయతీల హోదా ఇచ్చారు. కానీ ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమే. ప్రజల నుంచి ఆస్తి, కొళాయి పన్నులను వసూలు చేస్తున్నా నగర ప్రాంతానికి ఉండాల్సిన హంగులు లేవు. కనీసం డివైడర్ల రూపు రేఖలు మారడం లేదు. ఎక్కడ చూసినా మురుగు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. బుచ్చిలో 42 వేలు, అల్లూరులో 35 వేలకు పైగా జనాభా ఉన్నా వసతులు లేవు. పాలకులు వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది.

News March 25, 2026

నెల్లూరులో ఇద్దరు అధికారులపై వేటు

image

నెల్లూరు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో ZP ఏవో RPS వర్మను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహోషువాను APSIRDకి సరెండర్ చేశారు. ట్రైనింగ్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో చర్యలు తీసుకున్నారు.

News March 25, 2026

నెల్లూరు జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

image

నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం గూడూరు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.