News March 29, 2024
అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? – 1/2
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711688832889-normal-WIFI.webp)
ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తారు. ర్యాలీలు, బహిరంగ సభలు, పోస్టర్లు, బ్యానర్లు, యాడ్స్ ఇలా నానా హంగామా ఉంటుంది. మరి ఇంతకీ అభ్యర్థులు అధికారికంగా ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? లోక్సభ ఎన్నికలకు అయితే రూ.95లక్షలు, అసెంబ్లీ పోల్స్కు అయితే రూ.40లక్షలు. కొన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే లోక్సభకు రూ.75లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా లిమిట్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News February 5, 2025
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737736350357_367-normal-WIFI.webp)
TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 5, 2025
‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738740849160_1045-normal-WIFI.webp)
పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ త్వరలోనే షూటింగ్లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ పూర్తైతే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
News February 5, 2025
గూగుల్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738741377514_81-normal-WIFI.webp)
AP:గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్తో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.