News March 29, 2024
అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? – 1/2
ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తారు. ర్యాలీలు, బహిరంగ సభలు, పోస్టర్లు, బ్యానర్లు, యాడ్స్ ఇలా నానా హంగామా ఉంటుంది. మరి ఇంతకీ అభ్యర్థులు అధికారికంగా ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? లోక్సభ ఎన్నికలకు అయితే రూ.95లక్షలు, అసెంబ్లీ పోల్స్కు అయితే రూ.40లక్షలు. కొన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే లోక్సభకు రూ.75లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా లిమిట్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News October 5, 2024
T20 వరల్డ్ కప్లో నేటి మ్యాచులు
యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో భాగంగా మ.3.30కి ఆస్ట్రేలియాతో శ్రీలంక, గ్రూప్-Bలో భాగంగా రా.7.30కి ఇంగ్లండ్తో బంగ్లాదేశ్ తలపడతాయి. నిన్న జరిగిన మ్యాచుల్లో ఇండియాపై న్యూజిలాండ్, వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
పెరగనున్న పత్తి ధరలు?
TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్లో నిన్న కొత్త పత్తి క్వింటాల్కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.
News October 5, 2024
సోడాలు, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా..?
సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగేవారికి పక్షవాతం ముప్పు ఉందంటూ గాల్వే వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. వాటి వలన డయాబెటిస్, బీపీ పెరుగుతాయని వివరించారు. ఇక కంపెనీలు తయారు చేసే జ్యూస్లలో కృత్రిమ షుగర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, పెరాలసిస్ స్ట్రోక్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. వాటి బదులు సహజమైన పళ్లరసాలు శ్రేయస్కరమని సూచించారు. ఏం తిన్నా, ఏం తినకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి.