News March 29, 2024

డబ్బులు లేకనే ఐదు సార్లు ఓడిపోయా: తమిళి సై

image

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తాను ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడంతో ఓడిపోయానని ఆమె తెలిపారు. డబ్బులు లేకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్న మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు.

Similar News

News March 21, 2026

డిన్నర్‌కు వెళ్లా అంతే..: పుట్టా మహేశ్

image

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో TDP అధిష్ఠానానికి MP పుట్టా మహేశ్ వివరణ ఇచ్చారు. డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో TDP <<19392082>>షోకాజ్<<>> నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు TG మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికీ BRS షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఆయన స్పందించాల్సి ఉంది.

News March 21, 2026

₹18 కోట్లు చెల్లించి హార్ముజ్‌ను దాటిన నౌక!

image

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్ <<19429670>>టోల్ ఫీజు<<>> వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్‌గా వెళ్లేందుకు ఓ చమురు నౌక $2 మిలియన్లు(₹18.7 కోట్లు) చెల్లించినట్లు లాయిడ్స్ లిస్ట్ వెల్లడించింది. ఇండియా, మలేషియా, చైనా, పాక్ సహా పలు దేశాలు తమ నౌకలకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా 9 నౌకలు ఇరాన్ తీరం నుంచి వెళ్లినట్లు పేర్కొంది.

News March 21, 2026

ఇవాళ సెలవు

image

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. తొలుత జారీ చేసిన హాలిడేస్ లిస్ట్‌లో సెలవు నిన్న ఉండగా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ శనివారం జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వాలు నేడు సెలవు దినంగా ప్రకటించాయి. ఈ కారణంగా ఏపీలో ఇవాళ జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.