News March 29, 2024
అందుకే కేజ్రీవాల్ ఫోన్ కావాలంటున్నారు: అతిశీ
ఈడీని BJP పొలిటికల్ వెపన్లా వాడుకుంటోందని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘కేజ్రీవాల్ ఫోన్లో ఏముందో తెలుసుకోవాలని BJP అనుకుంటోంది. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఆయన వాడిన ఫోన్ తమకు లభించలేదని ఈడీ గతంలో చెప్పింది. ఇప్పుడేమో ఆయన ఫోన్ పాస్వర్డ్ చెప్పట్లేదని అంటోంది. ఫోన్లోని వివరాల కోసం కస్టడీని పొడిగించాలని కోరింది. లోక్సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకునేందుకే ఇలా చేస్తోంది’ అని అన్నారు.
Similar News
News October 5, 2024
T20 వరల్డ్ కప్లో నేటి మ్యాచులు
యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో భాగంగా మ.3.30కి ఆస్ట్రేలియాతో శ్రీలంక, గ్రూప్-Bలో భాగంగా రా.7.30కి ఇంగ్లండ్తో బంగ్లాదేశ్ తలపడతాయి. నిన్న జరిగిన మ్యాచుల్లో ఇండియాపై న్యూజిలాండ్, వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
పెరగనున్న పత్తి ధరలు?
TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్లో నిన్న కొత్త పత్తి క్వింటాల్కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.
News October 5, 2024
సోడాలు, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా..?
సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగేవారికి పక్షవాతం ముప్పు ఉందంటూ గాల్వే వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. వాటి వలన డయాబెటిస్, బీపీ పెరుగుతాయని వివరించారు. ఇక కంపెనీలు తయారు చేసే జ్యూస్లలో కృత్రిమ షుగర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, పెరాలసిస్ స్ట్రోక్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. వాటి బదులు సహజమైన పళ్లరసాలు శ్రేయస్కరమని సూచించారు. ఏం తిన్నా, ఏం తినకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి.