News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 8, 2026
బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.
News January 8, 2026
కాకినాడ: కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

తొండంగి మండలం వాకదారిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పలు ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏఎన్ఎం, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు MEO, DEO కార్యాలయాలను సంప్రదించలన్నారు.
News January 8, 2026
ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.


