News March 29, 2024
MBNR: ఏప్రిల్ 2న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏప్రిల్ 2న మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవనంలో నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే పటిష్ఠ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏప్రిల్ 4 నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగియనుంది.
Similar News
News March 17, 2026
పాలమూరు: రైతులు ALERT.. అప్లై చేసుకోండి

‘రైతు భరోసా’ కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం రైతులు ఈనెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆధార్, పట్టాదార్ పాస్ బుక్ (28/02/2026 వరకు వచ్చిన కొత్త పట్టా), బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. అర్హత గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT
News March 17, 2026
MBNR: ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు

నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ. 1 నుంచి రూ.7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 21-50 ఏళ్ల మధ్య వయస్సు వారు మార్చి 24లోపు TGOBMMS పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 98499 05996ను సంప్రదించవచ్చు.
News March 17, 2026
మహమ్మదాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.


