News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
సిద్దిపేట: ఘోర ప్రమాదం.. ఇద్దరు బాలురు మృతి

మిరుదొడ్డిలో <<19418573>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ముగ్గురు బాలురిలో చెన్నయ్ నితిన్ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మరో బాలుడు పిట్ల రామ్ చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మరో బాలుడు సాన హర్షవర్ధన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు.
News March 18, 2026
పుదుచ్చేరిలో ఎన్నికలు.. ‘జిల్లాలో మూడు చోట్ల చెక్ పోస్టులు’

పుదుచ్చేరి, యానాం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకు నీలపల్లి, మల్లవరం, సుంకరపాలెం వద్ద 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. అక్రమ మద్యం, నగదు, ఓటర్లకు పంచే సామాగ్రి తరలిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
News March 18, 2026
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం

కీసరగుట్టలోని శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ ప్రత్యేకంగా అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అన్నాభిషేకం చేసి స్వామికి అభిషేకించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు.


