News March 29, 2024

గుంతకల్లుకు గుమ్మనూరు.. అనంత అర్బన్‌కు వెంకటేశ్వర ప్రసాద్

image

గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం గుమ్మనూరు జయరాంను ఖరారు చేసింది. ఆలూరుకి చెందిన జయరాం వైసీపీ నుండి కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరగా.. ఎట్టకేలకు ఆయన పోటీచేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. అటు కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ భార్య కాకుండా ప్రసాద్ బరిలో ఉంటారని ప్రకటించింది. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో ఉంటారని టీడీపీ తుది జాబితాలో పేర్కొంది.

Similar News

News September 8, 2025

అనంత: సూపర్-6 సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు

image

చంద్రబాబు పాల్గొనే సూపర్-6 సూపర్ హిట్ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో కలిసి ముందస్తు ఏర్పాట్ల, సెక్యూరిటీ పరిశీలన చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, ప్రధాన వేదిక, ముఖ్యమంత్రి వెళ్లే రూట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 8, 2025

అనంత: జిల్లాలో జ్వర పీడిత కేసులు

image

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 600 నుంచి 800 మధ్య జ్వర పీడితులు ఉన్నట్లు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతపురం GGHలో 1,267 బెడ్స్ ఉన్నాయని చెప్పారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా బెడ్స్ కేటాయిస్తున్నామని అన్నారు. నార్పల, పెద్దవడుగూరు, యాడికి, బెలుగుప్ప, కళ్యాణదుర్గం ప్రాంతాల నుంచి జ్వర కేసులు వస్తున్నాయని తెలిపారు.

News September 8, 2025

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.