News March 29, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విద్వేషకర పోస్టులు పెట్టే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Similar News

News April 22, 2025

NLG: టార్పాలిన్లు లేక రైతన్నల పాట్లు

image

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.

News April 22, 2025

భూ సమస్యలు తీర్చేందుకే భూ భారతి: కలెక్టర్ ఇలా

image

రైతుల భూ సమస్యలు తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం-2025 తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం ఆమె గుండ్లపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు తెలంగాణ భూ భారతిపై అవగాహన కల్పించారు. భూ భారతిలో భూములకు సంబంధించి సవరణలు చేసే అవకాశం ఉందన్నారు.

News April 21, 2025

NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 58,228 మంది (మొదటి సంవత్సరంలో 28,840 మంది, రెండవ సంవత్సరంలో 29,338 మంది) విద్యార్థుల భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

error: Content is protected !!