News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
NLG: 22 నుంచి ఖాతాల్లోకి ‘భరోసా’.. పాస్ బుక్ ఉంటే చాలు..!

యాసంగి సాగుకు సంబంధించి ‘రైతు భరోసా’ నిధులను ఈ నెల 22 నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లాలోని 10.50 లక్షల మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వం తొలుత సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని భావించినా, రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు సాగులో ఉన్నా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్ కలిగిన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందనుంది.
News March 16, 2026
ఆసుపత్రిలో చేరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

TG రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ HYDలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మంత్రి వైరల్ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల నిశిత పర్యవేక్షణలో ఉన్నారు. జ్వరం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు అడ్లూరి లక్ష్మణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో SC, ST సంక్షేమ కార్యక్రమాలను వివరించే బాధ్యతను మంత్రికి అప్పగించారు.
News March 16, 2026
అమెరికాలో వరంగల్ వాసి గుండెపోటుతో మృతి

అమెరికాలో స్థిరపడిన వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేష్ (40) గుండెపోటుతో మృతి చెందారు. వర్జీనియాలో వృత్తిరీత్యా స్థిరపడిన ఆయనకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో చనిపోయారు. రాకేష్కు 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వరంగల్లోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


