News March 29, 2024

కావలికి చేరుకున్న చంద్రబాబు

image

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా కావలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి MLA అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, రూప్ కుమార్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి బొకేలు అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Similar News

News April 18, 2026

నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

image

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

News April 18, 2026

ఏపీ జట్టు కెప్టెన్‌గా ముత్తుకూరు యువకుడు

image

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు జరిగే జాతీయ స్థాయి టీ-10 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా నెల్లూరు జిల్లా ముత్తుకూరు యువకుడు బాపనపాటి ప్రకాశ్ ఎంపికయ్యాడు. కరీముల్లా, సునీల్, వెంకటేశ్, నాగేంద్ర, అఖిల్ తదితరులు జట్టు సభ్యులుగా అసోసియేషన్ ప్రకటించింది. స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 18, 2026

నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

image

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.