News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

కామారెడ్డి: చిరుత కళేబరం లభ్యం

image

బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేటగాళ్ల దుశ్చర్యగా భావిస్తున్న ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News March 14, 2026

వికారాబాద్: టెన్త్ విద్యార్థులకు అలర్ట్

image

జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయన్నారు. బాలురు 6,740 మంది, బాలికలు 6774మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు నిర్వహించనున్నారు. 9:30నిమిషాలకు పరీక్ష ప్రారంభం అవ్వనుండగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

News March 14, 2026

కామారెడ్డి: పది పరీక్షలకు 13,154 మంది విద్యార్థులు

image

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు డీఈవో రాజు తెలిపారు. వీరిలో 6,451 మంది బాలురు, 6,703 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 65 పరీక్షా కేంద్రాలు, 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు 739 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆయన వివరించారు.