News March 29, 2024
రాజంపేటలో భగ్గుమన్న అసమ్మతి సెగలు

రాజంపేటలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేయడంపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కరపత్రాలను దగ్ధం చేయడంతో పాటు పలువురు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇన్నిరోజులుగా పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గంలో పట్టు తీసుకొచ్చిన భత్యాల చాంగల్రాయుడుకు సీటు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో ఆయన అనుచరులు మండిపడ్డారు.
Similar News
News April 15, 2026
కడప: నేడు ఇంటర్ ఫలితాలు.. మార్కులే జీవితం కాదు.. బ్రో

కడప జిల్లాలో ఇంటర్-1, సెకండియర్ విద్యార్థులు 33,664 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల సమయంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ఓటమి అనేది విజయానికి తొలి మెట్టని అధికారులు సూచిస్తున్నారు. <<19635802>>తల్లిదండ్రులు<<>>, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని, అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
News April 15, 2026
కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనపరుచుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.
News April 15, 2026
కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనపరుచుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.


