News March 29, 2024

ఉద్యోగులపై దాడి చేసేందుకే ACB: నాదెండ్ల

image

కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకే ACBని ఉపయోగించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8 లక్షలకుపైగా ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రులు, నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని CM తనకు తానే ప్రకటించుకుంటారు. గత ఐదేళ్లలో అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులే ఎలా చెబుతారు’ అని ఆయన విరుచుకుపడ్డారు.

Similar News

News March 21, 2026

గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

image

KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్‌ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.

News March 21, 2026

ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.

News March 21, 2026

ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

image

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.