News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 21, 2026
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై పాడేరులో విస్తృత ప్రచారం

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.
News March 21, 2026
గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

KKR ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.
News March 21, 2026
ధర్మపురి: పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. భార్య మృతి..!

ప్రేమ పెళ్లి చేసుకుని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించగా బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ధర్మపురికి చెందిన బడుగు నవీన్, మసీదు రమ్య(22) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకోగా, గొడవల వల్ల 5 నెలలుగా రమ్య తన తల్లి వద్ద ఉంటోంది. ఈ నెల 16న అక్కడికి వెళ్లిన నవీన్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు SI మహేష్ తెలిపారు.


