News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
మార్చి 31లోపు బ్యాంక్ లింకేజ్, రికవరీలు పూర్తి చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో బ్యాంక్ లింకేజ్, రికవరీలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. మార్చి 31లోపు నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల సమన్వయంతో జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఇతర అధికారులున్నారు.
News March 18, 2026
VZM: ఎస్పీని కలిసిన ఉగాది పురస్కార గ్రహీతలు

ఉగాది-2026 సందర్భంగా సేవా పతకాలు పొందిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీ దామోదర్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించి, ఇదే స్ఫూర్తితో బాధ్యతగా పని చేయాలని సూచించారు. కాగా జిల్లాలో మొత్తం 8 మందికి పతకాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి ఉత్తమ సేవా పతకం, 7 సేవా పతకాలు ఉన్నాయి.
News March 18, 2026
పోలవరం నిర్వాసితులకు రూ.250 కోట్ల విడుదల

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ నిర్వాసితుల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నిధుల చెక్కును అందుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


