News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
News March 14, 2026
MHBD జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 99.91% హాజరు

మహబూబాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష(ఫస్ట్ లాంగ్వేజ్) ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 8,151 మంది విద్యార్థులు నమోదు కాగా.. 8,144 మంది హాజరయ్యారు. 7 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.91 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.
News March 14, 2026
ఇల్లంతకుంట సీతారామచంద్రుని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత, రంగులు వేసే పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేష్, కిరణ్, రామ్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


