News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 9, 2026
ఇండియాకు డిస్కౌంట్ ఆపేసిన రష్యా: రిపోర్ట్స్

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో రష్యా లాభపడుతోంది. ఇరాన్ యుద్ధానికి ముందు ఇండియా రిఫైనరీలకు (FEB 28) బ్యారెల్పై 13 డాలర్లు డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఇప్పుడు దాన్ని ఆపేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు బ్రెంట్ బ్యారెల్ ధరపై అదనంగా $4 నుంచి $5 ప్రీమియం వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో మిడిల్ ఈస్ట్ దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీంతో రష్యా కీలకంగా మారింది.
News March 9, 2026
NZB: జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడు: మహేశ్ కుమార్

జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన NZB ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు జర్నలిస్టుల ప్రధాన పాత్ర ఉందన్నారు. పత్రిక రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆ విశ్వసనీయత కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్లకు ఉందన్నారు. జర్నలిస్ట్ల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు.
News March 9, 2026
ఇంటర్ పరీక్షలకు 859 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు. 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.


