News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తాం: సీఎం

image

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇమామ్, మౌజన్లకు రూ. 5 వేలు, రూ. 10 వేల చొప్పున రూ. 180 కోట్లు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించామన్నారు.

News March 16, 2026

100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలి

image

బెట్టింగులు, నిషేధిత గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరిగిన నేర సమీక్షలో మాట్లాడుతూ.. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని బాధితులకు అండగా నిలవాలన్నారు.

News March 16, 2026

సిద్దిపేట: ఈ నెల 22న సీఎం పర్యటనపై మంత్రుల సమీక్ష

image

సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే రైతులకు తాగునీరు, రవాణా సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.