News March 29, 2024
ఆ టిప్పర్ డ్రైవర్ చంద్రబాబు కంటే ఎక్కువే చదివాడు: CM

AP: శింగనమల ఎమ్మెల్యే టికెట్ ఓ టిప్పర్ డ్రైవర్కు ఇచ్చామంటూ చంద్రబాబు తూలనాడాడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘అవునయ్యా.. చంద్రబాబు. మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం. ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు MA ఎకనామిక్స్, ఆపై బీఈడీ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు. మడకశిరలోనూ ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా’ అని అన్నారు.
Similar News
News April 10, 2026
ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.
News April 10, 2026
ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.
News April 10, 2026
మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. తాను మోదీని 22 రోజుల్లో హతమారుస్తానని, భారీగా డబ్బు ఇవ్వాలంటూ అమెరికా నిఘా సంస్థ CIAకు అమన్ తివారీ ఈమెయిల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.


