News March 29, 2024

వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చిన ఇద్దరు కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని NIA ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిసిన వాళ్లు 89042 41100 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే NIA ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.

Similar News

News December 28, 2025

అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

image

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <>వీడియో<<>> రిలీజ్ చేశారు.

News December 28, 2025

పాపులెవరు? ఎలాంటి వారికి నరకంలో శిక్ష పడుతుంది?

image

వేదశాస్త్రాలను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్య చేసేవారు కఠిన శిక్షార్హులు. పరస్త్రీలను ఆశించేవారు, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, దొంగతనాలు చేసేవారిని పాపాత్ములుగా పరిగణిస్తారు. శిశుహత్య, శరణు కోరిన వారిని బాధించడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను అపడం వల్ల కూడా నరకానికి పోతారట. ఈ దుశ్చర్యలు చేసే వారిని మరణానంతరం యమలోకానికి తీసుకెళ్లి, యముడి ఆజ్ఞ మేరకు నరకంలో కఠినంగా శిక్షిస్తారని నమ్మకం.

News December 28, 2025

IPLలో నో ఛాన్స్.. నేడు ₹కోట్ల సామ్రాజ్యం

image

టెస్ట్ అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన నీలేశ్ కులకర్ణి జర్నీ అద్భుతం. SLతో తొలి మ్యాచ్‌లో 70ఓవర్ల పాటు వికెట్ దక్కకపోయినా, IPL ఛాన్స్ రాకున్నా వెనక్కితగ్గలేదు. ఓటమినే పాఠంగా భావించి International Institute of Sports&Management (IISM) ద్వారా దేశంలోనే తొలి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్లేయర్స్ మేనేజ్‌మెంట్‌లోనూ గెలవొచ్చని నిరూపించారు.