News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
ఒక్క రోజులో 1.34లక్షల ఇండక్షన్ స్టవ్స్ విక్రయం

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్లో 1.34 లక్షలకు పైగా స్టవ్లు అమ్ముడయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్ను కంపెనీలు సైతం ఊహించకపోవడంతో చాలాచోట్ల ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 14, 2026
శ్రీగిరిలో ఉగాది కోలాహలం

శ్రీశైలం క్షేత్రం ఉగాది ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కర్ణాటక నుంచి కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్షేత్రమంతా భజనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాదయాత్రగా వస్తున్న భక్తుల శివనామస్మరణతో నల్లమల కొండలు మారుమోగుతున్నాయి. భక్తుల రాకతో శ్రీగిరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
News March 14, 2026
కర్నూలు: ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య

కర్నూలు మండలం గార్గేయపురం గ్రామ చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు రాజేశ్వరి (35), అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించారు. భర్తతో మనస్పర్థల కారణంగా రాజేశ్వరి కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈమె పిల్లలతో సహా చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.


