News March 29, 2024
రాజంపేట: తమ నేతకు టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711725840590-normal-WIFI.webp)
రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేటలో భవనంపై నుంచి దూకుతానని కొద్దిసేపు హల్చల్ చేశారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. టీడీపీ నేతలు కొందరు హుటాహుటిన భవనం పైకెక్కి మందా శీనును సముదాయించి కిందికి దించారు.
Similar News
News July 8, 2024
సిద్దవటం: సమాచారం ఇస్తే నగదు బహుమతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720440691220-normal-WIFI.webp)
ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఇస్తే కేసును బట్టి నగదు బహుమతిని అందజేస్తామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. సిద్దవటం రేంజ్లో గత మూడు రోజులుగా 4 బృందాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు ఇస్తే వారి పేర్లు గొప్యంగా ఉంచుతామన్నారు.
News July 8, 2024
కడప: విద్యా శాఖ ఆర్జేడీపై బదిలీ వేటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720422166315-normal-WIFI.webp)
కడప జిల్లా పాఠశాల ఆర్జేడీ రాఘవరెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఇటీవల రాఘవరెడ్డిపై అవినీతి, అక్రమాలపై ఆరోపణలు రావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టారు. క్రమశిక్షణా చర్యల కింద రాఘవరెడ్డిని విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు కడప పాఠశాల ఆర్జేడిగా కర్నూలు డీఈఓ శామ్యూల్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
News July 8, 2024
YSRకు మాజీ సీఎం జగన్ నివాళి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720405558593-normal-WIFI.webp)
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.