News May 7, 2025

జగిత్యాల: భూ భారతితో సత్వరమే పరిష్కారం: కలెక్టర్

image

భూ భారతి చట్టంతో భూమి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం వల్ల ఇన్నాళ్లు రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కొత్త మార్పులతో భూ భారతి చట్టం వచ్చిందన్నారు. సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామన్నారు.

Similar News

News March 19, 2026

పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

image

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్‌లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.

News March 19, 2026

సత్యసాయి జిల్లాలో పత్తి లారీ బోల్తా

image

తనకల్లు (మ) మండ్లిపల్లి సమీపంలో NH-47 జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ పత్తి లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి కాలు తెగిపోగా, మరొకరి చేతికి దెబ్బ తగిలింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2026

మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇచ్చాం: స్వామి

image

కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని మంత్రి స్వామి అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని.. త్వరలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను రోడ్డున పడేశారని విమర్శించారు.