News May 7, 2025
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- కలెక్టర్

గిరిజనులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఆయన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2026
బుగ్గారం: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామ ఎస్సీకాలనీ వద్ద గల జాతీయ రహదారిపై జగిత్యాల నుండి ధర్మపురి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


