News May 7, 2025

కూటమి సర్కార్‌కు బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ: పేర్ని నాని

image

AP: అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో CM చంద్రబాబు చెప్పారని, కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్నారని YCP నేత పేర్ని నాని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు, పవన్ ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? ఇంత బరితెగింపా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News March 10, 2026

వేలాది కోళ్లు మృతి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TGలోని నాగర్‌కర్నూల్(D)లో అంతుచిక్కని కారణంతో వేలాది కోళ్లు మృతి చెందాయనే సమాచారంతో AP ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లను తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లోని కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. చనిపోయిన కోళ్లను పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచించింది.

News March 10, 2026

సల్మాన్ మూవీలో హీరోయిన్‌గా సమంత?

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సూపర్ హీరో ఫిల్మ్‌లో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్&డీకే ద్వయం ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హ్యూమర్+యాక్షన్ ఉంటుందని సమాచారం. కాగా డైరెక్టర్ల ద్వయంలో ఒకరైన రాజ్‌‌ను సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

News March 10, 2026

యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.