News May 7, 2025

గుంటూరు: పదో తరగతి ఫలితాలపై పానుగంటి విమర్శలు 

image

పదో తరగతి ఫలితాలు దిగజారడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఓ ప్రకటనలో ఆరోపించారు. అమ్మ ఒడి రద్దు, ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం, ఇంగ్లిష్ మీడియంపై కక్ష, ఉపాధ్యాయుల తొలగింపు వంటి నిర్ణయాలే ఫలితాలు తగ్గడానికి కారణమని ఆయన విమర్శించారు. జగన్ హయాంలో విద్యా సంస్కరణలు, అమ్మ ఒడి వంటి పథకాలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

Similar News

News March 7, 2026

ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

image

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్‌లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

News March 7, 2026

గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

image

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News March 7, 2026

గుంటూరు: మిర్చి యార్డుకు సరకు రాకల్లో హెచ్చుతగ్గులు

image

గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే టిక్కీల సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు లక్షా 25 వేల వరకు టిక్కీలు వచ్చినా శుక్రవారం సుమారు 88 వేలకే పరిమితమయ్యాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదలకు స్పష్టమైన కారణం లేదు. హోలీ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు మాత్రమే లావాదేవీలు జరిగాయి. సోమవారం 1,04,740 టిక్కీలు రాగా తరువాత రోజుల్లో సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యార్డులో 26 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి.