News March 29, 2024

బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యం: ఎంపీ రాములు

image

నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ద్వారానే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి భరత్ పాల్గొన్నారు.

Similar News

News February 27, 2026

పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

image

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News February 27, 2026

MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

image

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.

News February 27, 2026

MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

image

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.