News May 7, 2025
జగిత్యాల: వడదెబ్బతో వ్యక్తి మృతి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద నివాసం ఉంటున్న గొల్లపల్లి జగన్ గౌడ్(38) వడదెబ్బతో అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జగన్కు భార్య జల, ఇద్దరు చిన్నారులు నిక్షిత, శ్రీ నిత్య ఉన్నారు. గత నాలుగు రోజుల క్రితం వడ దెబ్బ తగిలి అనారోగ్యం పాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 20, 2026
రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

లండన్లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్లో కింగ్స్బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది.
News March 20, 2026
హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.
News March 20, 2026
నేడే రాష్ట్ర బడ్జెట్

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.


