News March 29, 2024
ధర్మపురి: భక్తులతో కిటకిటలాడుతున్న లక్ష్మీ నరసింహుడి ఆలయం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శుక్రవారం ఆలయం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
Similar News
News September 8, 2025
MOUలతో విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు: కలెక్టర్

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కొత్తపల్లి(H) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు “ట్రస్మా” అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు జేఈఈ, ఐఐటీ, నీట్ కోర్సు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో MOUలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరిన్ని రంగాల్లో సేవలు అందిస్తామన్నారు.
News September 8, 2025
KNR: నేడు రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ సమావేశం

కరీంనగర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రాజకీయ పార్టీలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాటుపై సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
News September 7, 2025
కరీంనగర్లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.