News May 7, 2025
ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం రూ.1,29,618

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,29,618 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్లు అమ్మకం ద్వారా రూ.60,216, ప్రసాదాలు ద్వారా రూ.47,030, అన్నదానానికి రూ.22,372 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
ట్రెడిషనల్ లుక్లో నెల్లూరు కలెక్టర్

నెల్లూరు కలెక్టరేట్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం చదువుతున్నారు. కలెక్టర్ ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది.
News March 19, 2026
వనపర్తి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలు, ఆనందం బాధలన్నింటికీ ఉగాది పచ్చడి ప్రతీక అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
News March 19, 2026
మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


