News May 7, 2025

మెదక్: అకాల వర్షం.. తడిసిన ధాన్యం కుప్పలు

image

అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేస్తుంది. చేతికొచ్చిన ధాన్యం వర్షార్పణం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్చారం మండలం కొంగోడు వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఒకసారిగా వర్షం కురవడంతో అనేకచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మీరు నిలవడంతో తూకం వేయలేని పరిస్థితి నెలకొంది. ధాన్యం కాపాడేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

Similar News

News May 8, 2025

మెదక్: జాతీయ లోక్ అదాలత్‌పై సమావేశం

image

మెదక్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం. సుభవల్లి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్స్, పోలీస్ ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ అడ్వకేట్లు పాల్గొన్నారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి సిరి సౌజన్య పాల్గొన్నారు.

News May 7, 2025

జప్తి శివునూరు గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

image

నార్సింగ్ మండలం జప్తి శివునూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద సుధాకర్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన సుధాకర్ జప్తి శివునూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ, సంతానం లేకపోవడంతో మనస్తాపానికి గురై సుధాకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

మెదక్: రేపే మోడల్ స్కూల్ పరీక్ష

image

మెదక్ జిల్లాలో ఈనెల 27న ఆదివారం నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ స్కూళ్లలో కార్పొరేట్‌కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని, ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -SAHRE IT