News May 7, 2025
పెద్దపల్లి: చెరువులో మహిళ మృతదేహం కలకలం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లి శివారులోని గర్రెపల్లి చెరువులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమవడం స్థానికంగా కలకలంరేపింది. మృతురాలి వయసు 40-45 ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలు జీన్స్ ప్యాంటు, ఒకదానిపై ఒకటిగా మూడు షర్టులు వేసుకొని ఉందని, ఎవరికైనా ఆచూకి తెలిస్తే స్థానిక పోలీస్స్టేషన్ లేదా నెంబర్ 87126 56511 కు సమాచారం అందించాలని ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News March 13, 2026
జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎస్సై పోస్ట్.. అసలేంటీ వివాదం?

TG: విద్య, ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. SI పోస్టును జోనల్ స్థాయికి కేటాయించారు. ఏ జోన్కైతే ఎంపికైతారో అక్కడే సర్వీస్తో పాటు ప్రమోషన్లు ఉంటాయి. దీంతో ఆ జోన్లోని ఖాళీలను బట్టి ఒకే బ్యాచ్ SIలకు త్వరగా ప్రమోషన్లు వచ్చాయి. దీంతో వివాదం మొదలైంది. దీనికి తెరదించుతూ SI పోస్టును రాష్ట్రస్థాయికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు.
News March 13, 2026
రాష్ట్రంలో 17,992 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

TG: రాష్ట్ర హోంశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో 17,992 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అలాగే ఎస్సై పోస్టును జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి మార్చాలని సూచించారు.
News March 13, 2026
రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(NTC), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్(NCVT) కలిగిన వారు ఏప్రిల్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15ఏళ్లు పూర్తై, 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://rwf.indianrailways.gov.in


