News May 7, 2025

ములుగు: రేపే BRS రజతోత్సవ సభ

image

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్

Similar News

News March 7, 2026

గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!

image

AP: యుద్ధం వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం <<19309548>>నియంత్రణ<<>> నేపథ్యంలో TTD అధికారుల్లో ఆందోళన మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని IOCLను కోరింది. లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని లేఖ రాసినట్లు సమాచారం. TTDని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరగా IOCL సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

image

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.

News March 7, 2026

మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

image

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.