News May 7, 2025
WNP: ఇళ్ల ముందు నిలిపిన బైక్లే వారి టార్గెట్..!

MBNR, GDWL, NGKL, WNP, NRPT జిల్లాల్లో ఇళ్ల ముందు నిలిపిన పలు బైక్లను రాత్రిళ్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల ఎస్ఐ కళ్యాణ్ తెలిపిన వివరాలు.. గద్వాల వాసి వంశీ, మరో ఏడుగురు కలిసి బైక్లను చోరీ చేసేవారు. గతంలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 35బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వంశీని శుక్రవారం ధరూర్మెట్లో అరెస్ట్ చేసి మరో 5 బైక్లను సీజ్ చేశారు.
Similar News
News March 18, 2026
సూర్యాపేట: నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ నేతృత్వంలో నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.
News March 18, 2026
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న 87,150 మంది భక్తులు

ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 87,150 మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. పాదయాత్రతో కైలాస ద్వారం నుంచి 7,095 మంది, అన్నప్రసాద విభాగం ద్వారా 6,232 మంది తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి.
News March 18, 2026
మెదక్-నర్సాపూర్ రహదారిపై ప్రమాదం.. ఇద్దరి మృతి

మెదక్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోతంశెట్టిపల్లికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండీ యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరేకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


