News May 7, 2025
సూర్యాపేట: రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

మునగాల మండలం ఆకుపాముల వద్ద శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి విజయవాడకు బైకుపై అన్నా చెల్లెలు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ అకుపాముల వద్ద
గేదె అడ్డురావటంతో డివైడర్ను ఢీకొట్టారు. దీంతో బైకు వెనకాల కూర్చున్న ఆమె రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి లారీ ఆమె పై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.
Similar News
News April 1, 2026
NLG: ప్రజాపాలన అప్లికేషన్స్ మాయం.. కలెక్టర్కు ఫిర్యాదు

కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన మహిళ పథకాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఆన్లైన్ రశీదు ఉన్నా కార్యాలయంలో ఫైల్ కనిపించడం లేదు. దీనిపై బాధితురాలు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News April 1, 2026
సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన తిప్పర్తి (M) దుప్పలపల్లి రైతు వేదికలో సాంకేతిక ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
News April 1, 2026
సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన తిప్పర్తి (M) దుప్పలపల్లి రైతు వేదికలో సాంకేతిక ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.


