News May 7, 2025
జడ్చర్ల: వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో డీకే అరుణ

జడ్చర్లలోని ప్రేమ్ రంగా గార్డెన్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సులో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ముస్లిం పేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టం అని అన్నారు. 2018 రిపోర్ట్ ప్రకారం ఈ దేశంలో 80 లక్షల ఎకరాలు భూములు వక్ఫ్ ఆస్తులున్నట్లు తేలిందన్నారు. కానీ ఈ ఆస్తుల వల్ల ఏ ఒక్క పేద ముస్లింకు న్యాయం జరగలేదన్నారు.
Similar News
News March 14, 2026
కామారెడ్డి: ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 1,738 మంది విద్యార్థులకు గాను 1,588 మంది హాజరు కాగా, 150 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం జరిగాయని ఆయన వివరించారు.
News March 14, 2026
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, గ్యాస్ కొరత సృష్టించినా, అక్రమ నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1077 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.
News March 14, 2026
MHBD: పరీక్ష కోసం తల్లిదండ్రుల మరణ వార్తను దాచారు!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గన్యచక్ర తండాకు చెందిన <<19379355>>సోములు, మంగమ్మ దంపతులు HYD పటాన్చెరులో హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. కాగా హత్యకు గురైన తల్లిదండ్రుల విషయం తెలిస్తే బాలిక పరీక్షపై ప్రభావం పడుతుందని భావించిన గ్రామస్థులు, పరీక్ష పూర్తయ్యే వరకు విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చిన బాలికకు విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యింది.


