News May 7, 2025

తూ.గో: ప్రేమజంట సూసైడ్.. ఏం జరిగిందంటే?

image

నెల్లూరులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొవ్వూరుకు చెందిన జోసఫ్, కైకలూరుకు చెందిన శ్రావణి 21న నెల్లూరు సింహపురి హోటల్లో రూము తీసుకున్నారు. తర్వాత రోజు బయటకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత రూము నుంచి బయటకు రాలేదు. విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. శుక్రవారం వరకు బయటకు రాకపోవడం, రూము నుంచి దుర్వాసన వెదజల్లడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా చేశారని సమచారం.

Similar News

News March 22, 2026

ప్రజా సమస్యలకు చెక్.. సోమవారం మిస్ కావద్దు!

image

జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు హాజరై ప్రజల నుంచి PGRS అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

News March 22, 2026

10,897 సిలిండర్లు సిద్ధం.. ఆందోళన వద్దు: JC

image

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరఫరా సజావుగా సాగుతున్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.