News May 7, 2025
వికారాబాద్ జిల్లాలో టెండర్ల ఆహ్వానం

వికారాబాద్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి అన్ని ఔట్సోర్సింగ్ సర్వీసులు ఏర్పాటు చేయడం నిమిత్తం రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు సీల్ టెండర్లు కోరుతున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. టెండర్ల డాక్యుమెంట్లను జిల్లా ఉపాధి కల్పన అధికారి నుంచి మే 6లోగా కార్యాలయ పని దినాల్లో పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి మే 6వ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 13, 2026
NZB: ‘జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి’

రాజీ మార్గమే రాజ మార్గమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, మైనర్ క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్, సివిల్ వివాదాలు సులభంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 13, 2026
మాజీ DGP HJ దొర కన్నుమూత

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.
News March 13, 2026
UPDATE: ప్రమాద బస్సులో రామ చిలుకలు.. కొన్ని మృతి..!

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సులో అధికారులు రామచిలుకల పెట్టెను గమనించి బయటకు తీశారు. పెట్టెలో సుమారు 60 రామచిలుకలను కుక్కి ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ కొన్ని చిలుకలను పశువైద్యశాలకు తరలించారు.


