News May 7, 2025
ప్రకాశం: ఇద్దరు ప్రభుత్వ అధికారులకు నోటీసులు

పంచాయతీ రాజ్ విభాగాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఒంగోలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దారవీడు పీఈవో, యర్రగొండపాలెం ఈవో హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ ఎందుకు రాలేదని, వెంటనే షోకాజ్ ఇవ్వాలని ఆదేశించారు. వై.పాలెంలో వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈవోకు అనుమతి ఇచ్చానని ఎంపీడీవో తెలుపగా, అనుమతి ఎలా ఇస్తావని ఎంపీడీవోకి షోకాజ్ ఇచ్చారు.
Similar News
News March 11, 2026
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, ఫైనల్ మెరిట్ జాబితాను మంగళవారం జిల్లా కో-ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.
News March 11, 2026
ప్రకాశం: ఆసుపత్రులలో జాబ్స్.. తుది జాబితా విడుదల..!

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల ఫైనల్ మెరిట్ జాబితాను మంగళవారం జిల్లా కో ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్,తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.
News March 10, 2026
కొండేపి: పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి స్వామి మంగళవారం విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన తన పదో తరగతి పరీక్షల అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా రాయాలని పలు కీలక సూచనలు చేశారు.


