News May 7, 2025

ఖమ్మం: వడదెబ్బతో పది మంది మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులు 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైరా మండలంలో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది మంది వడదెబ్బతో మృతి చెందారు. రాబోయే మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.

Similar News

News March 31, 2026

నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాలి: ఖమ్మం ఎంపీ

image

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

News March 31, 2026

నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాలి: ఖమ్మం ఎంపీ

image

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

News March 31, 2026

ఖమ్మం: ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 పథకాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఈడీ నవీన్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక మద్దతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.