News May 7, 2025
రేపటితో ముగియనున్న అనకాపల్లి కొత్త అమావాస్య జాతర

అంకపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర శనివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా నెల పండుగ జరుపుకోనున్నారు. ఆఖరి ఆదివారం కావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ముగింపుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడానికి సాయంత్రం 4:30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నట్టు ఈవో రాంబాబు తెలిపారు.
Similar News
News March 14, 2026
మళ్లీ వర్షాలు!

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 14, 2026
అనంతగిరిలో పుట్టింది.. HYDలో ఆగమైంది!

మనుషుల దాహాన్ని తీర్చి, పొలాలకు నీరందించే నదులు నేడు కన్నీరు పెడుతున్నాయి. మానవ అవసరాల కొరకు నదిలోని ఇసుక తవ్వేస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రసాయనాలను విడుదల చేసి నదులను కలుషితం చేస్తున్నాడు. నదులు మన సంస్కృతికి చిహ్నాలు. మన జిల్లాలోనే పుట్టి సర్వ నాశనం అయిన మూసీ ఇందుకు ఉదాహరణ. ఇకనైనా మేల్కొందాం.. రాజకీయాలకు అతీతంగా మన మూసీని కాపాడుకుందాం.
నేడు International Day of Action for Rivers
News March 14, 2026
‘శల్య సారథ్యం’ అంటే?

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>


