News May 7, 2025

వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 14, 2026

సూళ్లూరుపేటలో జువెలరీ షాపులో దోపిడి

image

సూళ్లూరుపేట పట్టణంలోని కచేరి వీధిలో ఉన్న వెంకటేశ్వర జువెలరీ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగింది. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.45 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

News March 14, 2026

రేపు గాంధీభవన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ

image

టీజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం ఉ. 10 గం.కు గాంధీభవన్‌లో మొగిలి సునీత రావు నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

News March 14, 2026

శ్రీశైలం ఆలయ ప్రవేశ మార్గాల్లో డీఎఫ్ఎండీలు ఉపయోగించాలి: ఎస్పీ

image

ఆలయం లోపలికి ప్రవేశించు మార్గాలలో తప్పనిసరిగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD )ను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశించారు. శనివారం బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సాధారణ భక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో రోడ్డు ఓపెనింగ్ పార్టీ (ROP)లు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు.