News May 7, 2025
వరంగల్: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.
Similar News
News March 14, 2026
కడప: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

కడప (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్లో QR కోడ్ను ముద్రించారు. దీనిని ఫోన్లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్ ఫొటోలు కనిపిస్తాయని కడప జిల్లా DEO షంషుద్దీన్ తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>
News March 14, 2026
అన్నమయ్య: 10th పబ్లిక్.. ఎగ్జామ్ సెంటర్ గుర్తించండిలా.!

అన్నమయ్య (D)లో ఈ నెల 16 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థులకు ప్రభుత్వం ఓ సరికొత్త సౌకర్యాన్ని కల్పించింది. పరీక్ష కేంద్రాలను గుర్తించడంలో ఇబ్బందులు లేకుండా హాల్ టికెట్లో QR కోడ్ను ముద్రించారు. దీనిని ఫోన్లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, ఫొటోలు కనిపిస్తాయని జిల్లా అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. మరింత సమాచారం కోసం <<19371473>>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
News March 14, 2026
మెదక్: 11న పెళ్లి చూపులు.. యువతి MISSING

మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ(22) ఇస్నాపూర్లో అదృశ్యమైంది. తన బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పటాన్చెరు పోలీసులు సురేఖ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


