News March 30, 2024

అనకాపల్లి: 85 ఏళ్లు దాటిన వారికి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్

image

ఓటింగ్‌ శాతం తగ్గరాదనే ముందు చూపుతో ఎన్నికల సంఘం 85 ఏళ్లు దాటిన వారికి, 40% పైగా వైకల్యమున్న దివ్యాంగులకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్ వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు అందించి, వారితో ఓటు వేయించే బాధ్యత రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలతో బీఎల్వోలే తీసుకుంటారని తెలిపింది. నోటిఫికేషన్‌ విడుదలైన ఐదు రోజుల్లో వాటిని భర్తీ చేసి బీఎల్వోలకు సమర్పించాలని నోడల్‌ అధికారి హేమంత్‌ తెలిపారు.

Similar News

News January 21, 2026

స్టీల్ ప్లాంట్‌లో VRSకి గడువు పెంపు

image

స్టీల్ ప్లాంట్లో VRSకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. VRS దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది DEC 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం VRSకి ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 500 దరఖాస్తులు అందినట్లు సమాచారం.

News January 21, 2026

జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

image

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.

News January 20, 2026

జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ 3.0 ప్రారంభం

image

జీవీఎంసీ మరో ముందడుగు వేసింది. ఆపరేషన్ లంగ్స్-3.0 పేరిట సెల్లార్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్డ్ మంగళవారం తెలిపారు. చాలా భవనాల్లో సెల్లార్లు వ్యాపార నిలయాలుగా మారడంతో రహదారులపై పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, వెంటనే వీటిని ఆయా యజమానులు తొలగించాలన్నారు. లేదంటే జీవీఎంసీ తొలగిస్తుందని హెచ్చరించారు.