News May 7, 2025
ఉత్తర కొరియా వద్ద 5 వేల టన్నుల ‘డెస్ట్రాయర్’ నౌక!

నౌకదళ సంపత్తి పరంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమైంది. 5వేల టన్నుల బరువైన ‘మల్టీపర్పస్ డెస్ట్రాయర్’ నౌకను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ప్రారంభించారు. దేశ అధికారిక మీడియా KNCA ప్రకారం.. అది చో హ్యోన్ క్లాస్కు చెందిన అత్యాధునిక నౌక. దాన్ని 400 రోజుల్లోనే ప్యాంగ్యాంగ్ నిర్మించింది. పలు రకాలైన క్షిపణుల్ని మోసుకెళ్లే సామర్థ్యం దానికి ఉంది.
Similar News
News March 13, 2026
ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

AP: ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.
News March 13, 2026
విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <
News March 13, 2026
మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.


