News May 7, 2025

జడ్చర్ల GOVT కాలేజీలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని (నాగర్‌కర్నూల్ సెంటర్) తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంపీసీఎస్, ఎంపీసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు కళాశాలలో సంప్రదించాలని కోరారు. SHARE IT

Similar News

News March 22, 2026

నర్మెట: లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి: మంత్రి తుమ్మల

image

కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నర్మెటలో జరుగుతున్న రైతు సదస్సులు మాట్లాడారు. ‘లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి. మనకు అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన అన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్దిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నామన్నారు. ఇదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు.

News March 22, 2026

గ్రీన్ ఎనర్జీలో ఏపీ నంబర్-1: సీఎం చంద్రబాబు

image

భవిష్యత్తులో అన్ని కంపెనీల డేటా సెంటర్లు భారత్‌కే వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. HYD ISBలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏపీకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లను తీసుకొచ్చాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సోలార్, గ్రీన్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో మేమే నంబర్-1’ అని తెలిపారు.

News March 22, 2026

చిత్తూరు జిల్లా SP వినతి

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు SP ఆఫీసు వెల్లడించింది. ఉ.10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు తెలిపారు.