News May 7, 2025
NZB: భారత్ సమ్మిట్లో పాల్గొన్న జిల్లా నాయకులు

హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా జరుగుతున్న భారత్ సమ్మిట్లో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహేర్ బిన్ హందాన్ తదితరులు ఉన్నారు.
Similar News
News July 5, 2025
NZB: వరల్డ్ పోలీస్ గేమ్స్లో బాబాకు మరో బ్రాంజ్ మెడల్

వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ బాబా మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అమెరికాలోని అలబామాలో జరుగుతున్న వరల్డ్ పోలీస్ ఆండ్ ఫైర్ గేమ్స్లో భాగంగా 35 ఏళ్ల కేటగిరిలో బాబా 110 మీటర్ల హర్డిల్స్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. అక్కడి భారతీయ అభిమానులు ఆయనను అభినందించారు.
News July 5, 2025
ట్రిపుల్ఐటీకి 14 మంది బెజ్జోరా పాఠశాల విద్యార్థులు

భీమ్గల్ మండలం బెజ్జోరా ఉన్నత పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీకి ఎంపిక చేస్తారు. శుక్రవారం సాయంత్రం విడుదలైన బాసర ఆర్జీయూకేటీ ఫలితాల్లో ఒకేసారి 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని పాఠశాల హెడ్మాస్టర్ హఫీసుద్దీన్ అన్నారు. ఉపాధ్యాయ బృందానికి మండలంలోని పలువురు టీచర్స్ అభినందనలు తెలిపారు.
News July 4, 2025
NZB: రెండు రోజుల పసికందు విక్రయం

NZBలో 2 రోజుల పసికందును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణి జూన్ 30న ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశివుకు జన్మనించింది. నాగారానికి చెందిన ఓ మధ్యవర్తి సాయంతో పులాంగ్ ప్రాంతానికి చెందిన మరో మహిళకు రూ.2 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఈ విషయం 1 టౌన్ పోలీసులకు తెలియడంతో తల్లితో పాటు మధ్యవర్తులను విచారిస్తున్నారు.