News March 30, 2024
ఏపీ స్పీకర్కు వ్యతిరేక పవనాలు!
ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేనికి సొంత పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. స్థానికంగా వైసీపీ కీలక నేత సువ్వారి గాంధీకి, తమ్మినేనికి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే సీతారాంకు టికెట్ ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు గాంధీ దంపతులు, సంబంధీకులు రాజీనామాలు చేసేశారు. స్వతంత్రంగా బరిలో దిగుతామంటున్నారు. దీంతో 20వేల వరకు ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.
Similar News
News October 5, 2024
బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు
AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
News October 5, 2024
నటి నాలుగో పెళ్లి వార్తలు.. అవన్నీ సినిమా స్టంట్స్
తమిళ నటి వనిత విజయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్ను <<14242143>>వివాహం<<>> చేసుకుంటాననే అర్థంలో కొన్ని రోజుల కిందట ఫొటో షేర్ చేసింది. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.
News October 5, 2024
బాత్రూమ్లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకు?
US NCBI ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు బాత్రూమ్లోనే జరుగుతున్నాయి. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. మలబద్ధకం ఉన్న వారు ముక్కినప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. అప్పుడు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.