News March 30, 2024

చిత్తూరు: 6వ తేదీ వరకు గడువు పొడిగింపు

image

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు చిత్తూరు డీఈవో దేవరాజు తెలిపారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి 12 వరకు ప్రవేశ పరీక్ష అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News April 22, 2025

మాట నిలబెట్టుకున్న సీఎం: చిత్తూరు ఎంపీ

image

సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసి మాట నిలబెట్టుకున్నారని చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News April 21, 2025

CTR: హజ్ యాత్రికులకు ఉచిత వ్యాక్సినేషన్

image

ముస్లిం సోదరులకు చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి శుభవార్త చెప్పారు. హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించారు. చిత్తూరులోని టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుందని చెప్పారు. యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

News April 21, 2025

తిరుపతి SVU పరీక్షలు వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాల్గో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించిన పరీక్షలను మే 12, 14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. 24 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

error: Content is protected !!